జిహెచ్ఎంసి ఎన్నికకు ముందే కాంగ్రెస్ కు భారీ షాక్..!

-

ప్రస్తుతం జిహెచ్ఎంసి ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీల అభ్యర్థులు ప్రచారంలో ఎంతో వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇతర పార్టీల నేతలు తమ పార్టీలోకి ఆకర్షించడంలో కూడా కొంతమంది విజయం సాధిస్తున్నారు. ముఖ్యంగా కొన్ని డివిజన్లలో అధికార పార్టీ లోకి వలసలు జిహెచ్ఎంసి ఎన్నికల నేపథ్యంలో ఎక్కువవుతున్నాయి. ఇటీవలే కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులైన వేలాది మంది వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్ పార్టీలోకి చేరారు. సూరారం డివిజన్ కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు వేణుగోపాల రాజు తన అనుచరులతో కలిసి కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఎన్నికల ఇంచార్జ్ వేముల ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ రాజు ఆధ్వర్యంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు

ఈ సందర్భంగా మాట్లాడిన వేముల ప్రశాంత్ రెడ్డి దేశంలోరాష్ట్రంలో లేని ఏ  విధంగా కేసీఆర్ సర్కార్ అభివృద్ధి చేసి చూపిస్తున్నారని.. కెసిఆర్ అభివృద్ధి పనులను చూసి ఎంతో మంది ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారు అంటూ చెప్పుకొచ్చారు. గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ దే ఘన విజయం అంటూ ధీమా వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news