‘సంతోష్ విగ్రహం సంతోషమే.. అంబేద్కర్ ఏం పాపం చేశారు’

-

హైదరాబాద్: కల్నల్ సంతోష్ విగ్రహం పెట్టడం సంతోషమే కానీ అంబేద్కర్ ఏం పాపం చేశారని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు ప్రశ్నించారు. సూర్యాపేటలో దివంగత కల్నల్ సంతోష్ బాబు విగ్రహం చేస్తున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 3వల్లనే తెలంగాణ వచ్చిందని గుర్తు చేశారు.

2019 ఏప్రిల్ 12న జై భీం కార్యకర్తలు పంజాగుట్టలో అంబేడ్కర్ విగ్రహాన్ని పెట్టే ప్రయత్నం చేశారని వీహెచ్ చెప్పారు. అయితే మున్సిపల్ అధికారులు అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారని తెలిపారు. మళ్ళీ తాము విగ్రహం పెట్టాలని ప్రయత్నిస్తే తీసుకువెళ్లి గోషామహల్ పోలీస్ స్టేషన్‌లో పెట్టారని పేర్కొన్నారు. అంబేడ్కర్ విగ్రహం కోసం అందరినీ కలుపుకుని పోరాటం చేస్తామని చెప్పారు. అసదుద్దీన్ ఒవైసి, చాడా వెంకట్ రెడ్డి, ఎల్ రమణ, ఉత్తమ్, భట్టితో మాట్లాడానని చెప్పారు. ఈ నెల 17న రౌండ్ టేబుల్ మీటింగ్ ఏర్పాటు చేస్తామని వీహెచ్ తెలిపారు.

‘‘ప్రభుత్వ భూములు అమ్మితే భవిష్యత్‌లో స్మశానాలకు కూడా స్థలం దొరకదు. భవిష్యత్ తరాలకు ఇబ్బంది అవుతుంది. గత ప్రభుత్వాలు భూములన్ని అమ్మితే ఈ రోజు భూములు ఉండేవా?. పార్టీలన్నీ కలిసి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలి. బడుగు బలహీన వర్గాలకే పీసీసీ ఇవ్వాలి.’’ అని వీహెచ్ డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news