కాంగ్రెస్ పార్టీ ఓటముల నుండి గుణపాఠాలు నేర్చుకోవడం లేదు – కిరణ్ కుమార్ రెడ్డి

-

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి నేడు బిజెపిలో చేరారు. ఢిల్లీలోని బిజెపి కేంద్ర కార్యాలయంలో ఆయన కాషాయతీర్థం పుచ్చుకున్నారు. కిరణ్ కుమార్ రెడ్డికి కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి పార్టీ సభ్యత్వాన్ని అందించి, కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. తాను కాంగ్రెస్ పార్టీని వీడతానని ఏనాడు అనుకోలేదన్నారు.

ఆ పార్టీ తీసుకున్న నిర్ణయాలతో దేశంలోని చాలా రాష్ట్రాలలో ఆ పార్టీ తీవ్రంగా నష్టపోయిందని.. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో కాంగ్రెస్ పార్టీ తెలుసుకోవడం లేదన్నారు. చేసిన తప్పులను కూడా కాంగ్రెస్ పార్టీ తెలుసుకోవడం లేదని, ఆ పార్టీకి అధికారం మాత్రమే కావాలన్నారు. ఓటముల నుండి కాంగ్రెస్ పార్టీ గుణపాఠాలు నేర్చుకోవడం లేదన్నారు కిరణ్ కుమార్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news