కాంగ్రెస్ వాళ్లకు మేడిగడ్డ తప్ప.. వేరే గడ్డే దొరకట్లే: మల్లారెడ్డి

-

నేటితో అసెంబ్లీ సమావేశాలు ముగిశాయి. అసెంబ్లీని నిరవధికంగా వాయిదా వేస్తూ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నిర్ణయం తీసుకున్నారు.ఈ క్రమంలో అసెంబ్లీ సమావేశాలపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

శనివారం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. ఈసారి అసెంబ్లీ సమావేశాలు అట్టర్ ప్లాప్ అయ్యాయని అన్నారు. కాంగ్రెస్ వాళ్లకు మేడిగడ్డ తప్ప వేరే గడ్డనే దొరకడం లేదని మల్లారెడ్డి సెటైర్ వేశారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయిన దగ్గరి నుండి రోజూ మేడిగడ్డ మేడిగడ్డ అంటే ప్రజలు పరేషాన్ అవుతున్నారు అని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో ఎక్కడో చిన్న లీకేజీ అయ్యిందని.. దానిని ప్రభుత్వం భూతద్దంలో చూపిస్తుందని ఆరోపించారు .

 

Read more RELATED
Recommended to you

Latest news