నన్ను హతమార్చేందుకు కుట్రలు జరుగుతున్నాయి: చింతమనేని ప్రభాకర్

-

తనను హతమార్చేందుకు కుట్రలు జరుగుతున్నాయని అన్నారు టిడిపి నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. ఇటీవలే ఓ అగంతకుడు తనకు ఫోన్ చేసి తనను చంపేందుకు షూటర్ ను ఏర్పాటు చేసినట్లు బెదిరించాడని చెప్పారు. బెదిరింపు కాల్ వచ్చిన ఫోన్ నెంబర్, కాల్ రికార్డింగ్ తో సహా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఇంతవరకు కేసు నమోదు చేయలేదని తెలిపారు.

బి సింగవరం లో తనపై ఈవ్ టీజింగ్ కేసు పెట్టారని, తనది ఈవ్ టీజింగ్ చేసే వయసా? అని చింతమనేని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. ఇంతకంటే దారుణం ఏముంటుంది అని ఆయన ప్రశ్నించారు. ఇప్పటివరకు వైసీపీ ప్రభుత్వం తనపై 26 కేసులు నమోదు చేసిందని చింతమనేని తెలిపారు. ఇందులో ఎస్సీ, ఎస్టీ కేసులు కూడా ఉన్నాయని చెప్పారు.

సీఎం జగన్ కు దమ్ముంటే ఒక ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి తనపై ఉన్న కేసుల పై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. వై వి సుబ్బారెడ్డి, జోగి రమేష్, కొట్టు సత్యనారాయణలు తనేంటో తెలుసుకొని మాట్లాడాలని హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news