మహేష్ కోసం బాలీవుడ్ భామలను రంగంలోకి దింపుతున్న జక్కన్న..!!

-

పాన్ ఇండియా దర్శకుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఈయన దర్శకత్వంలో ఓ సినిమా చేయాలని ప్రతి ఒక్క హీరో కూడా ఆశ పడుతూ ఉంటారు. ఇక అభిమానులు ఎంతకాలం నుంచో ఎదురు చూస్తున్న కాంబో మన ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. అదే మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా రానున్నట్లు అనౌన్స్మెంట్ కూడా చేశారు. ఇప్పటికే ఈ సినిమా కోసం రాజమౌళి కొన్ని కీలక పాత్రల కోసం కొంతమంది ని ప్రత్యేకంగా సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. రాజమౌళి తాజాగా ఆర్ ఆర్ ఆర్ సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకోవడమే కాకుండా దేశం గర్వించదగ్గ దర్శకుడు గా చలామణి అవుతున్నారు. ఈ సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్లు రాబట్టి ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే.Bollywood starlet in talks for Mahesh Babu's nextఇదిలా ఉండగా రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ మహేష్ బాబు కోసం ఒక అద్భుతమైన కథను రెడీ చేయడం.. త్రివిక్రమ్ తో మహేష్ బాబు సినిమా అయిన వెంటనే రాజమౌళి సినిమా చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం మహేష్ బాబు కూడా సర్కారు వారి పాట విజయంతో మంచి ఊపు మీద ఉన్న విషయం తెలిసిందే. ఇక ఈ క్రమంలోనే త్రివిక్రమ్ తో మహేష్ బాబు షూటింగ్ మొదలు పెట్టబోతున్నాడు. ఈ ఏడాది చివరికి అంతా ఈ సినిమా షూటింగ్ పూర్తవుతుంది. ఇక జనవరి నుంచి రాజమౌళి సినిమా మొదలవుతున్న నేపథ్యంలో ఇప్పటికే మహేష్ బాబుకు బావమరిది గా అడవి శేషు నటించబోతున్నట్లు సమాచారం కూడా.. ఇక బాలీవుడ్ నుంచి హీరోయిన్ ను తీసుకొస్తున్నారు. ఇక ఇందులో శ్రద్ధా కపూర్ అయితే ఈ కథకు సరిగ్గా సరిపోతుందని జక్కన్న ఆమెను సంప్రదిస్తున్నట్లు సమాచారం. సాహో సినిమా తర్వాత శ్రద్ధాకపూర్ నటిస్తున్న రెండవ పాన్ ఇండియా చిత్రం కూడా ఇదే కావడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Latest news