ఏపీలో కరోనా కలకలం… 16 మంది హాస్టల్ విద్యార్థులకు పాజిటివ్..!

-

ఏపీలో కరోనా కలకలం రేగింది. 16 మంది హాస్టల్ విద్యార్థులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ లోని రంగనాయక మెడికల్ కాలేజి హాస్టల్లో కరోనా ఆందోళన కలిగించింది. 16 మంది వైద్య విద్యార్థులకు కరోనా సోకింది. ఈ హాస్టల్ లో మొత్తం 200 మంది విద్యార్థులకు టెస్ట్ లు నిర్వహించారు. కాగా వారిలో 16 మందికి పాజిటివ్ గా తేలింది. దాంతో పాజిటివ్ వచ్చిన విద్యార్థులను అదే హాస్టల్లో ప్రత్యేక గదుల్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

corona
corona

అయితే ఇటీవల ఓ విద్యార్థి ఢిల్లీలో ఫంక్షన్ కు వెళ్లి వచ్చినట్లు తెలుస్తోంది. దాంతో అతడి నుండి హాస్టల్ లోని 15 మందికి కరోనా సోకిందని అధికారులు అనుమానిస్తున్నారు. ఇది ఇలా ఉంటే దేశంలో కి కొత్త కరోనా వేరియంట్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. పలు రాష్ట్రాల్లో కొత్త వేరియంట్ కు సంబంధించిన కేసులు నమోదవుతున్నాయి. దాంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మాస్కులు ధరించాలని… 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరు తప్పకుండా వ్యాక్సిన్ వేసుకోవాలని వైద్య అధికారులు కోరుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news