తెలంగాణ ఇంటర్ బోర్డులో కరోనా కలకలం.!

-

తెలంగాణలో కరోనా వైరస్ విస్తరిస్తున్న తీరు ఆందోళనను కలిగిస్తోంది. ప్రభుత్వానికి చెందిన పలు శాఖల్లో పని చేస్తున్న ఉద్యోగులు కూడా దీని బారిన పడుతున్నారు. తాజాగా.. ఇంటర్‌ బోర్డులో ఆరుగురు బోర్డు సిబ్బందితో పాటు 9 మంది వాళ్ళ కుటుంబ సభ్యులకు కోవిడ్ పాజిటివ్ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. గతంలోనూ ఇంటర్ బోర్డులో ఆరుగురికి కరోనా పాజిటివ్ వచ్చింది.

తాజా కేసులతో తెలంగాణ ఇంటర్ బోర్డులో ఇప్పటి వరకు మొత్తం 21 మందికి కరోనా పాజిటివ్ సోకింది. దీంతో ఉద్యోగుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే కార్యాలయానికి సందర్శకులను అనుమతించడం లేదు. పరీక్షల నిర్వహణ నుంచి ఫలితాల విడుదల వరకు విద్యార్థులకు, ఇన్విజిలేటర్లకు, అధ్యాపకులకు, వ్యాల్యుయేషన్‌ లో పాల్గొన్నవారికి కరోనా వైరస్ సోకకుండా అనేక జాగ్రత్తలు తీసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news