ఏపీ సచివాలయంలో మరోసారి కరోనా కలకలం..!

-

ఏపీలో రోజురోజుకూ కరోనా విజృంభిస్తోంది. తాజాగా ఏపీ సచివాలయంలో మరోసారి కరోనా కలకలం రేపింది. తాజాగా మరో ఐదుగురు ఉద్యోగులకు కరోనా పాజివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో అసెంబ్లీ, సచివాలయంలో కరోనా పాజిటివ్ కేసులు 38కి చేరుకున్నాయి. కరోనా సోకిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అలాగే వారు ఇంకా ఎవరెవరితో సన్నిహితంగా ఉన్నారనే అంశంపై అధికారులు ఆరా తీస్తున్నారు.

వరుసగా కరోనా కేసులు పెరుగుతుండటంతో సచివాలయ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 23,814కు చేరాయి. మెుత్తం మృతుల సంఖ్య 277కు చేరింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 53 మందికి కరోనా సోకింది. విదేశాల నుంచి వచ్చిన వారిలో ఇద్దరికి పాజిటివ్​గా నిర్ధరణ అయింది. కరోనా నుంచి కోలుకుని మరో 904 మంది డిశ్ఛార్జి అయ్యారు.ప్రస్తుతం ఆస్పత్రిలో 10,894 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు.ఇప్పటివరకు 11,101 మంది డిశ్ఛార్జి అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news