ఏపీలో భారీగా కరోనా కేసులు… ఒక్కరోజులోనే 7,948..!?

-

గత కొన్ని రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు రికార్డు స్థాయిలో పెరిగిపోతు తీవ్ర భయాందోళన కలిగిస్తున్న విషయం తెలిసిందే. కరోనా వైరస్ నియంత్రణకు ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినప్పటికీ… నమోదవుతున్న కేసులో మాత్రం ఆందోళనకర పరిస్థితులకు దారి తీస్తుంది. రోజురోజుకు భారీగా కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అత్యధిక కేసులో ఉన్న రాష్ట్రాల్లో మూడవ స్థానం లోకి చేరిన విషయం తెలిసిందే, తాజాగా ఈ రోజు కూడా రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి.

coronavirus
coronavirus[tps_header][/tps_header]
24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో… 7949 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య లక్ష పదివేల 297 చేరిపోయింది. కాగా ప్రస్తుతం రాష్ట్రంలో 55,527 యక్టివ్ కేసులు ఉండగా… 52622 మంది ఆస్పత్రి నుంచి చికిత్స తీసుకుని కోలుకున్నారు. ఇక ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య 1148 చేరింది. ఇలా రోజు రికార్డు స్థాయిలో కేసులు నమోదు అవుతుండటం ఆంధ్రప్రదేశ్లో ప్రాణాపాయాన్ని కలిగిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news