బీహార్ సీఎం నితీష్ కుమార్ కు కరోనా పాజిటివ్

-

దేశంలో కరోనా కల్లోలం కలిగిస్తోంది. వరసగా ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు. ముఖ్యంగా ప్రజలకు అందుబాటులో ఉండే రాజకీయ ప్రముఖులు కరోనా బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా బీహార్ సీఎం నితీష్ కుమార్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కార్యాలయం ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ప్రస్తుతం సీఎం హోం క్వారంటైన్ లో ఉన్నారని తెలిపింది. ప్రజలు కూడా కోవిడ్ ప్రోటోకాల్ పాటించాలని సూచించింది. బీహార్ క్యాబినెట్ సమావేశాలకు ముందు ఇద్దరు డిఫ్యూటీ సీఎంలతో పాటు కొంత మంది మంత్రులకు కూడా కోవిడ్ పాజిటివ్ గా తేలింది.

ఇప్పటికే కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు కరోనా పాజిటివ్ గా తేలింది. ఆయన కూడా హోం క్వారంటైన్ లో ఉన్నారు. ఇదిలా ఉంటే దేశంలో సినిమా స్టార్లకు, సెలబ్రెటీలకు కూడా కరోనా సోకింది. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అయితే చాలా మంది రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నా కరోనా మళ్లీ సోకుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news