BREAKING : మలక్ పేట యశోద ఆసుపత్రిలో కరోనా రోగి ఆత్మహత్య..!

-

మలక్ పేట యశోద ఆసుపత్రిలో కరోనాకు చికిత్స పొందుతున్న బాధితుడు రవీందర్‌ రాజు(60) భయంతో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆసుపత్రిలోని 503 రూమ్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. బాత్ రూమ్‌లోని షవర్‌కి.. పేషెంట్ వేసుకునే గౌన్‌తోనే ఉరి వేసుకున్నాడు. నిన్న రాత్రి 2:30 గంటల సమయంలో సూసైడ్‌కు పాల్పడ్డాడు.

అయితే ఇది గమనించి ఆసుపత్రి సిబ్బంది చాదర్ ఘాట్ పోలీసులకు సమాచారం అందించడంతో.. వారు  కేసు నమోదు చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా  ఆసుపత్రికి తరలించారు. అయితే ఫీజులు ఎక్కువ తీసుకుంటున్నారు అనే భయంతో కుటుంబం అప్పుల పాలు కాకూడదు అని ఆలోచించి రవీందర్‌ రాజు ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తుంది. కాగా, ఇప్పటికే రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి అధికంగా ఫీజులు వసూలు చేస్తున్న హాస్పిటల్స్ పై వేటు వేసిన సంగతి తెలిసిందే. అయినా సరే కొన్ని హాస్పిటల్స్ మాత్రం తమ వైఖరి మార్చుకోవట్లేదు.

Read more RELATED
Recommended to you

Latest news