వైఎస్ఆర్సిపి నేత అంబటి రాంబాబుకు కరోనా పాజిటివ్…!

-

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ రోజురోజుకి విజృంభిస్తోంది. సామాన్య ప్రజలతో పాటు రాజకీయ నేతలు కూడా కరోనా బారినపడి ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికే అధికార పార్టీ వైఎస్ఆర్సిపి లో పలువురు ప్రజాప్రతినిధులకు కరోనా సోకిన విషయం అందరికీ విదితమే. తాజా సమాచారం ప్రకారం సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు కు కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ జరిగింది. దీంతో ప్రస్తుతం ఆయన హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో ఆయన ఎవరిని కలిశారన్న వివరాలను అధికారులు తెలుసుకుంటున్నారు.

ambati-rambabu
ambati-rambabu

అంబటి రాంబాబుకు కరోనా పాజిటివ్ అని తేలడంతో వారి కుటుంబ సభ్యుల అందరికీ కరోనా పరీక్షలు చేయనున్నారు వైద్య సిబ్బంది. రెండు రోజుల క్రితం వైఎస్ఆర్సిపి ఎంపీ విజయసాయి రెడ్డి కి కూడా కరోనా పాజిటివ్ అని నిర్ధారించిన విషయం తెలిసిందే. దీంతో ఆయన ప్రస్తుతం హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. ఆయనతోపాటు ఇప్పటికే రాష్ట్రంలోని డిప్యూటీ సీఎం అంజాద్ భాష తో పాటు పలువురు ఎమ్మెల్యేలకు కరోనా సోకిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news