ఏపీ సచివాలయంలో దారుణం.. మొన్న భర్త నేడు భార్య, కరోనాతో మృతి !

-

ఏపీ సచివాలయంలో మృత్యు ఘంటికలు మోగుతున్నాయి. వరుసగా మూడో రోజు డెత్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు నలుగురు ఏపీ సచివాలయ ఉద్యోగులు కరోనా కారణంగా మృతి చెందారు. గత రెండు రోజుల్లో ఇద్దరు.. ఇవాళ మరో ఇద్దరు ఉద్యోగులు మృత్యువాత పడ్డారు.

పంచాయతీ రాజ్ శాఖ సెక్షన్ ఆఫీసరుగా పని చేస్తున్న శాంతి కుమారి, హోమ్ డిపార్ట్మెంట్ లో రికార్డు అసిస్టెంట్ ఏఎస్ఎన్ మూర్తి కరోనాతో ఇవాళ మృతి చెందారు. అయితే బాధాకరమైన విషయం ఏమిటంటే రెండు రోజుల క్రితం శాంత కుమారి భర్త పద్మారావు కరోనాతో మృతి చెందారు. అయితే ఈరోజు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శాంతి కుమారి మృతి చెందింది. కరోనా తీవ్రత దృష్ట్యా వర్క్ ఫ్రమ్ హోంకు అనుమతివ్వాలని ఉద్యోగుల డిమాండ్ చేస్తున్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news