భార‌త బ్యాడ్మింట‌న్ ప్లేయ‌ర్ సాయిప్ర‌ణీత్ కు క‌రోనా

-

క‌రోనా వైర‌స్ ఎవ‌రినీ విడిచిపెట్ట‌డం లేదు. సామాన్యులు, క్రికెట‌ర్లు, సినిమా న‌టీన‌టులు, ఆట‌గాళ్లు ఇలా అన్ని రంగాల‌లో చాలా మంది క‌రోనా బారిన ప‌డుతున్నారు. తాజా గా భార‌త్ బ్యాడ్మింట‌న్ ప్లేయ‌ర్ సాయి ప్ర‌ణీత్ కూడా క‌రోనా బారిన ప‌డ్డారు. త‌న‌కు స్వ‌ల్ప ల‌క్ష‌ణాలు ఉండ‌టంతో క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు జ‌రుపుకున్నట్టు తెలిపారు. ఈ ప‌రీక్ష‌లో త‌న‌కు పాజిటివ్ గా నిర్ధార‌ణ అయింద‌ని సాయి ప్ర‌ణీత్ అధికారికంగా ధృవీక‌రించాడు.

దీంతో త‌ను ప్ర‌స్తుతం హోం ఐసోలేష‌న్ లో ఉన్నానని తెలిపారు. కాగ బ్యాడ్మింటన్ స్టార్ సాయి ప్ర‌ణీత్ కు క‌రోనా పాజిటివ్ గా నిర్ధార‌ణ కావ‌డంతో మంగ‌ళ వారం నుంచి ప్రారంభం కానున్న ఇండియా ఓపెన్ కు ఆయ‌న దూరం కానున్నాడు. కాగ భార‌త టాప్ బ్యాడ్మింట‌న్ ప్లేయ‌ర్ క‌రోనాతో ఈ టోర్నీ దూరం కావ‌డంతో అభిమానులు నిర‌శ‌కు గురి అయ్యారు. కాగ సాయి ప్ర‌ణీత్ గ‌త కొద్ది రోజుల నుంచి సూప‌ర్ ఫామ్ లో ఉన్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news