హైదరాబాద్‌లో దారుణం… నగ్నంగా మహిళ మృతదేహం

-

దేశం లో మహిళలపై అఘాయిత్యాలు ఏ మాత్రం తగ్గడం లేదు. రోజు రోజు కు మహిళలపై దాడులు పెరగడమే తప్ప ఎక్కడా తగ్గడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా.. మహిళలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. అయితే.. తాజాగా హైదరాబాద్‌ కోకాపేట సెవెన్‌ హిల్స్‌ వద్ద దారుణం చోటు చేసుకుంది.

నిర్మానుష్య ప్రాంతంలో ఓ మహిళ మృత దేహం కలకలం రేపింది. ఖాలీ ప్రదేశంలో నగ్నంగా ఉన్న మహిళ మృత దేహం గుర్తించిన స్థానికులు.. నార్సింగి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. క్లూస్‌ టీమ్‌, డాగ్‌ స్క్వాడ్‌ తో ఆధారాలు సేకరిస్తున్నారు.

గుర్తు తెలియని మహిళను రేప్‌ చేసి..ఆ పై హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. వారం, పది రోజుల కింద హత్య జరిగి ఉండవచ్చని.. నార్సింగి సీఐ శికుమార్‌ పేర్కొన్నారు. ఇక సంఘటన తాను కేసు నమోదు చేసుకున్నామని చెప్పిన ఆయన… త్వరలోనే ఈ కేసును ఛేదిస్తామని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news