బ్రేకింగ్‌ : స్పీకర్‌ పోచారం శ్రీనివాస రెడ్డికి కరోనా.. టెన్షన్‌ లో కేసీఆర్‌, జగన్‌ !

-

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఇవాళ నిర్వహించిన కరోనా పరీక్షల్లో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కి కరోనా సోకినట్లు వెల్లడైంది. దీంతో ఆయన హైదరాబాద్లోని ఏఐజీ అనే ప్రైవేట్… ఆస్పత్రిలో చేరారు. ఈ విషయాన్ని స్వయంగా స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు.

”రెగ్యులర్ మెడికల్ టెస్ట్ లలో భాగంగా నిన్న రాత్రి చేయించిన కోవిడ్ టెస్ట్ లో నాకు పాజిటివ్ నమోదు అయింది. ప్రస్తుతం నాకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేనప్పటికీ డాక్టర్ల సూచనల మేరకు AIG, గచ్చిబౌలి హాస్పిటల్ లో జాయిన్ అయ్యాను..గత కొన్ని రోజులుగా నన్ను కలిసిన, సన్నిహితంగా ఉన్న వారు కోవిడ్ టెస్ట్ చేయించుకుని తగు జాగ్రత్తలతో హోమ్ ఐసోలేషన్ లో ఉండగలరని మనవి” అంటూ పోచారం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. అయితే… గత నాలుగు రోజుల క్రితమే.. తన మనవరాలి పెళ్లి రోజున రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో విందులో పాల్గొన్నారు పోచారం. దీంతో ఇద్దరు సీఎంలు ఆందోళన చెందుతున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news