ఏపీలో కరోనా కొత్త రికార్డ్..! 24 గంటల్లో 8 వేలకు పైగా కేసులు.!

-

ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుంది.. దీని దెబ్బకి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. లాక్ డౌన్ సడలింపుల తర్వాతే దీని ప్రభావం మరీ తీవ్రంగా మారింది. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా.. దీన్ని కట్టడి చేయలేకపోతున్నారు. కాగా, తాజాగా.. గడిచిన 24 గంటల్లో 8,147 పాజిటివ్ కేసుల వెల్లడి కాగా, రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 80,858కి చేరింది.

తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జిల్లాలో కొత్తగా 1029 మందికి  కరోనా సోకినట్టు తేలింది. ఇక, మరణాల సంఖ్య కూడా భారీగానే నమోదైంది. గడచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 49 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. దాంతో కరోనా మృతుల సంఖ్య 933కి పెరిగింది. అటు, కరోనా నుంచి కోలుకున్న 2,380 మందిని డిశ్చార్జి చేశారు. ఇంకా 39,990 మంది చికిత్స పొందుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news