ఇండియాలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు..!

-

భారత్ లో కరోనా అల్లకల్లోలం సృష్టిస్తోంది. ప్రజలకూ, ప్రభుత్వానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఏరోజుకారోజు నమోదవుతున్న కేసుల సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. దీంతో ప్రజలు వణికిపోతున్నారు. ఈ మహమ్మారి దెబ్బకు ఇప్పటికే ఎంతో మంది మరణించారు. అయినా ఇది మాత్రం తగ్గుముఖం పట్టట్లేదు. పరీక్షలు పెంచే కొద్ది కేసులు కూడా భారీగా పెరిగిపోతున్నాయి. కాగా, దేశంలో గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో కొత్తగా 24,850 కరోనా కేసులు నమోదవ్వగా, 613 మంది మరణించినట్టు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది.

దీంతో ఇండియాలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,73,165కి చేరుకుంది. ఇందులో ఇప్పటివరకు 4,09,083 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా.. 19,268 మంది మరణించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 2,44,814 యాక్టివ్ కరోనా కేసులున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news