తెలుగు రాష్ట్రాల్లో కరోనా భీభత్సం..! వణికిపోతున్న జనం..!

-

ఆంధ్రప్రదేశ్ లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 7,998 కరోనా కేసులు నమోదు కాగా, 61 మంది మరణించినట్టు వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. అలాగే 5,248 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయినట్లు వెల్లడించింది. తాజా కేసులతో ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 72,711కి చేరింది. వీరిలో కరోనా నుంచి 37,555 మంది డిశ్చార్జి కాగా.. ఇప్పటి వరకు 884 మంది మరణించారు. ప్రస్తుతం ఏపీలో 34,272 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.

అలాగే తెలంగాణలో గత 24 గంటల్లో కొత్తగా 1,567 కరోనా కేసులు నమోదవ్వగా, తొమ్మిది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 50,826కి చేరింది. కరోనాతో రాష్ట్రంలో మొత్తం 447 మంది మరణించారు. తెలంగాణలో ఇప్పటివరకు కరోనా నుంచి 39,327 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 11,052 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్‌ విడుదల చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news