ఏపీలో సినిమా చూపిస్తున్న కరోనా మరణాలు

-

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. మరోసారి రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా నమోదు అయ్యాయి అని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజాగా విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది. గత 24 గంటల్లో ఏపీలో దాదాపుగా 5 వేల కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా 58 వేల 668 మందికి సోకింది అని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించిన హెల్త్ బులిటెన్ లో పేర్కొన్నారు.

యాక్టివ్ కేసులు 32, 336 గా ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్రంలో కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 25574 గా ఉందని తెలిపింది ప్రభుత్వం. మొత్తం 758 ఇప్పటి వరకు రాష్ట్రంలో ప్రాణాలు కోల్పోయారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో ఎవరికి కరోనా రాలేదు. గత 24 గంటల్లో 62 మంది మరణించారు అంటే కరోనా తీవ్రత ఏ రూపంలో ఉంది అనేది స్పష్టంగా అర్ధమవుతుంది. గత 24 గంటల్లో రాష్ట్రంలో 37 వేల 162 మందికి పరిక్షలు చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news