కరోనా సోకింది, ఆస్పత్రిలో ఒకోకరు గుడ్ బై చెప్పుకుని చచ్చిపోయారు…!

-

కరోనా వైరస్ తీవ్రత ప్రపంచ వ్యాప్తంగా ఏ స్థాయిలో ఉందో అందరికి తెలిసిందే. వేలాది మంది ఈ వ్యాధి బారిన పడి ఇప్పడు ప్రాణాలు కోల్పోతున్నారు. చైనాలో జనం పిట్టల మాదిరి రాలిపోతున్నారు. దీనితో అన్ని దేశాలు కూడా ఈ వ్యాధి విషయంలో చాలా అప్రమత్తంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు 400 మందికి పైగా ఈ వైరస్ సోకి ప్రాణాలు విడిచినట్టు చైనా వెల్లడించింది.

ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వీడియో విస్తృతంగా వైరల్ అవుతుంది. 80 ఏళ్ళ వయసులో ఉన్న ఇద్దరు వృద్ధ కరోనావైరస్ రోగులు ఒకరికి ఒకరు వీడ్కోలు చెప్పుకున్నారు. వృద్ధ దంపతుల వీడియోను ట్విట్టర్ యూజర్ ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. వీడియో హార్ట్ బ్రేకింగ్ అని… ఇద్దరు వృద్ధ రోగులు ఐసియులో వీడ్కోలు చెప్పారు, ఇది కలవడానికి మరియు అభినందించడానికి చివరిసారి కావచ్చు. అని ట్వీట్ చేసాడు.

మరొకరు… “ఈ వృద్ధులు బాధపడటం చూడటం చాలా భయంకరంగా ఉంది. పరిస్థితి పూర్తిగా నియంత్రణలో లేదు. షేర్ చేసినందుకు ధన్యవాదాలు.” అని కామెంట్ చేసారు. చైనాలో, కరోనావైరస్ బారిన పడి కనీసం 361 మంది మరణించినట్లు ప్రభుత్వం సోమవారం తెలిపింది. ఎంత విచారకరమైన వీడియో … కానీ అది జీవితాంతం ముగియని ఆ ప్రేమ యొక్క వైభవం గురించి చాలా చెప్పింది అని కామెంట్ చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news