రోజురోజుకు విజృంభిస్తున్న కరోనా.. 2 వేల మందికిపైగా…

-

చైనాలోని వుహాన్‌ నగరంలో వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచదేశాలను భయపెడుతోంది. ఇప్పటివరకు వందల సంఖ్యలో ప్రజలు చైనాలో ఈ వైరస్‌ బారిన పడగా, నేటికి 25మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇప్పుడు ఈ వైర‌స్‌ వంద‌ల నుంచి వేల‌కు చేరుకుంది. చైనాలో తొలిసారిగా వెలుగులోకి వచ్చి, ఆపై ఒక్కో దేశానికీ విస్తరిస్తున్న ప్రమాదకర కరోనా వైరస్, రోజురోజుకూ మరింతగా విజృంభిస్తోంది. ఇప్పటికే చైనాలో 2 వేల మందికి పైగా ఈ వైరస్ బారిన పడ్డారని చైనా అధికారులు స్పష్టం చేశారు.

ఇప్పటివరకూ 56 మంది మరణించారని ఆదివారం నాడు ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది. వైరస్ ను అరికట్టడంపై పోలిట్ బ్యూరో సమావేశాన్ని నిర్వహించిన అధ్యక్షుడు జీ జిన్ పింగ్, పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్టు తెలిపారు. ఈ వైరస్ వ్యాప్తిని నిలువరించేందుకు ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య శాఖ నిపుణులు కృషి చేస్తున్నారని అన్నారు. కాగా, ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తుండటంతో భారత్‌ అప్రమత్తమైంది. దేశంలోని పలు అంతర్జాతీయ విమానాశ్రయాల్లో అధికారులు అప్రమత్తమయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news