BREAKING : మంత్రి అంబటిపై కేసు నమోదుకు కోర్టు ఆదేశాలు…

-

BREAKING : ఏపీ మంత్రి అంబటి రాంబాబుకు బిగ్‌ షాక్‌ తగిలింది. మంత్రి అంబటి పై కేసు నమోదు కు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. సత్తెనపల్లి లో సంక్రాంతి లక్కీ డ్రా పేరుతో టిక్కెట్లు అమ్మకాలు చేస్తున్నారని కోర్టు లో పిటిషన్ వేశారు జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరా రావు.

ఈ నేపథ్యంలోనే, సత్తెనపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని కోర్టుకు పిర్యాదు చేశాడు. మంత్రి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో టిక్కెట్లు అమ్మకాలు జరిగాయని ఫిర్యాదు చేశాడు గాదె వెంకటే శ్వరరావు. దీంతో అంబటి రాంబాబు పై తక్షణం కేసు నమోదు చేయాలి అని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఫిబ్రవరి 21 లోపు విచారణ పూర్తి చేసి కోర్టుకు వాస్తవాలు తెలపాలని సత్తెనపల్లి పోలీసులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news