గృహ హింస కేసులో కన్నా కోడలికి రూ.కోటి పరిహారం ఇవ్వాలని కోర్టు తీర్పు

-

విజయవాడ : మాజీ మంత్రి కన్నా లక్ష్మి నారాయణకు దిమ్మతిరిగే షాక్‌ తగిలింది. కన్నా లక్ష్మి నారాయణకు కోడలుకు ఏకంగా కోటి రూపాయలు నష్ట పరిహారం ఇవ్వాలని కన్నా కుటుంబానికి విజయవాడ ఒకటో అదనపు చీఫ్ మెట్రో పాలిటన్ మేజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేసింది. ఇటీవలే మాజీ మంత్రి కన్నా, భార్య విజయలక్ష్మి, కుమారుడు నాగరాజుపై గృహ హింస కేసు పెట్టింది కన్నా కోడలు శ్రీ లక్ష్మి కీర్తి.

2015 లో నమోదైన కేసుపై విచారణ జరిపి తాజా ఆదేశాలు ఇచ్చింది విజయవాడ ఒకటో అదనపు చీఫ్ మెట్రో పాలిటన్ మేజిస్ట్రేట్. వసతి కోసం 50 వేలు, కుమార్తె వైద్య ఖర్చుల కోసం 50 వేలు, కోటి నష్ట పరిహారం 3 నెలల్లో ఇవ్వాలని ఆదేశారు జారీ చేసింది విజయవాడ ఒకటో అదనపు చీఫ్ మెట్రో పాలిటన్ మేజిస్ట్రేట్. లేకుంటే 12 శాతం వడ్డీతో చెల్లించాలని తీర్పులో స్పష్టం చేసింది న్యాయ స్థానం. తాము ఇచ్చిన తీర్పు మేరకు ఇరుగురు నడవాలని స్పష్టం చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news