సీపీఐ నేత నారాయణకి స‌తీ వియోగం

-

సీపీఐ జాతీయ కార్య‌ద‌ర్శి నారాయ‌ణ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయ‌న స‌తీమ‌ణి వ‌సుమ‌తి దేవి (65) క‌న్ను మూశారు. కాగ వ‌సుమ‌తి దేవి గ‌త కొద్ది రోజుల నుంచి అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ ప‌డుతున్నారు. వ‌సుమ‌తి దేవి త‌న అనారోగ్య స‌మ‌స్య ల‌కు తిరుప‌తిలో ఒక ఆస్ప‌త్రిలో చికిత్స పొందారు. అయితే ఈ రోజు వ‌సుమ‌తి దేవి ఆరోగ్యం మ‌రోసారి విషమించ‌డందో తిరుప‌తి లోని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న స‌మ‌యంలో వ‌సుమ‌తి దేవి మ‌ర‌ణించారు. కాగ సీపీఐ నేత నారాయ‌ణ – వ‌సుమ‌తి దేవి స్వ స్థ‌లం ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలోని న‌గ‌రి మండ‌లంలో గ‌ల ఐనంబాకం అను గ్రామం. కాగ వ‌సుమతి అంత్య క్రియ‌లు శుక్ర వారం.. ఆమె స్వ స్థ‌లం ఐనంబాకం గ్రామంలోనే జ‌రుగుతాయ‌ని సీపీఐ నేత‌ నారాయ‌ణ కుటుంబ స‌భ్యులు తెలిపారు. కాగ‌ సీపీఐ నేత నారాయ‌ణ భార్య క‌న్ను మూయ‌డంతో రెండు తెలుగు రాష్ట్రాల‌కు చెందిన‌ ప‌లువురు రాజ‌కీయ ప్ర‌ముఖులు సానుభూతి ప్ర‌క‌టిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news