BREAKING : మునుగోడు ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీకి సిపిఎం మద్దతు

-

మునుగోడు ఉప ఎన్నికలపై సిపిఎం పార్టీ కీలక ప్రకటన చేసింది. తాము మునుగోడు ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇవ్వలని నిర్ణయం తీసుకున్నట్లు… తెలంగాణ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రకటన చేశారు.

మునుగోడు ఎన్నిక విషయంలో కాంగ్రెస్, టీఆరెస్ నుండీ మద్దతు కావాలని విజ్ఞప్తులు వచ్చాయి.. మా రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు మునుగోడు లో బీజేపీ ఓడించడానికి టీఆరెస్ కి మద్దతు ఇస్తున్నామన్నారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం.

ఇక ఇప్పటికే సిపిఐ పార్టీ కూడా టిఆర్ఎస్ కు మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. ఇక మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడంతో మునుగోడు ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. ఇక మునుగోడు ఉపఎన్నిక అన్ని రాజకీయ పార్టీలకు కీలకంగా మారడంతో ప్రధాన పార్టీలన్నీ మునుగోడుని హస్తగతం చేసుకోవడం కోసం వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news