బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో క్రికెటర్ మిథాలి రాజ్ భేటీ

-

బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాసేపటి క్రితమే శంషాబాద్ ఎయిర్ పోర్టు కి చేరుకున్నారు. జేపీ నడ్డా తో పాటు ఆయన సతీమణి కూడా హైదరాబాదుకి వచ్చారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు లో జేపీ నడ్డాకి ఘన స్వాగతం పలికారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్, తరుణ్ చుగ్, పలువురు బిజెపి నేతలు. అనంతరం శంషాబాద్ లోని నోవాటేల్ హోటల్ కి చేరుకున్న జేపీ నడ్డా అక్కడే భారత మహిళా క్రికెటర్, మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ తో భేటీ అయ్యారు.

ఈరోజు వరంగల్ లోని హనుమకొండ లో తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర ముగింపు సందర్భంగా ఏర్పాటు చేస్తున్న భారీ బహిరంగ సభలో పాల్గొనేందుకు జేపీ నడ్డా హైదరాబాద్ కి చేరుకున్నారు. ఈ క్రమంలోనే పలువురు సినీ ప్రముఖులు, రచయితలు, అలాగే క్రీడాకారులతో సమావేశం కానున్నారు. అయితే ఇప్పటికే మిథాలీ రాజ్ తో భేటీ కాగా.. టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరైన నితిన్ తో నడ్డా బేటీ కానుండడం ఆసక్తికర పరిణామం.

Read more RELATED
Recommended to you

Latest news