హైదరాబాద్ లో దారుణం.. నగ్న ఫోటోలు తీసి, భర్తకు చూపిస్తానని బెదిరించి లైంగిక దాడి..!

-

తన పిల్లలకు ఈత నేర్పించాలంటే తీసుకొచ్చిన మహిళతో సాన్నిహిత్యం పెంచుకున్నాడు. ఆమెను బ్లాక్ మెయిల్ చేసి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. అత్యాచారం కేసు నమోదు చేసిన మేడిపల్లి పోలీసులు రిమాండ్కు తరలించారు. పోలీసుల వివరాల ప్రకారం మేడ్చల్ జిల్లా బోడుప్పల్ కు చెందిన వివాహితకు ఇద్దరు పిల్లలు.

వారికి ఈత నేర్పించాలని పల్లవి మోడల్ స్కూల్ లోని స్విమ్మింగ్ కీచ్ గా పనిచేస్తున్న బోడుప్పల్ సిద్ధి వినాయక కాలనీకి చెందిన సుజిత్ (23) ను సంప్రదించారు. పిల్లలకు ఈత నేర్పించే క్రమంలో అతను మహిళతో సానిహిత్యం పెంచుకున్నాడు. ఆమె తన వ్యక్తిగత సమస్యల్ని చెప్పారు. ఇదే అదనుగా అనుమతి లేకుండా వ్యక్తిగత ఫోటోలు తీసుకున్నాడు. ఫోటోలు చూపించి తనతో గడపాలంటూ బెదిరించాడు.

అంగీకరించకపోవడంతో దాడికి దిగాడు. బాధితురాలి భర్తలేని సమయం చూసి నేరుగా ఇంటికెళ్లి దాడి చేసి అత్యాచారం చేశాడు. ఆ తర్వాత ఆ పలుమార్లు ఆమెపై అదే తరహాలో అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఫోటోలు భర్తకు పంపిస్తానంటూ రూ.లక్ష తీసుకున్నాడు. వేధింపులు భరించలేకపోయిన బాధితురాలు షీ టీమ్స్ ద్వారా మేడిపల్లి పోలీసులను ఆశ్రయించారు. నిందితుడు ప్రస్తుతం రిమాండ్ లో ఉన్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news