దారుణం…భార్యను బ్యాటుతో, పిల్లలను దిండుతో హతమార్చిన టెకీ…!

-

జీవితంలో వచ్చిన కష్టాలతో ఓ టెకి ఉన్మాదిగా మారాడు. భార్యను కన్న బిడ్డలను హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకున్నాడు.ఈ ఘటన చెన్నై లో చోటు చేసుకుంది. చెన్నై లోని పెరుగుండి లో నివాసం ఉంటున్న మనిగండన్ అనే వ్యక్తి సాప్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. అతడికి భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు. హఠాత్తుగా మండిగన్ ఉద్యోగం మానేసి ఇంటివద్దనే ఉండటం మొదలు పెట్టాడు. తరవాత ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి.

స్నేహితులు, బ్యాంకుల వద్ద లక్షల్లో అప్పులు చేశాడు. ఆ అప్పుల భారం మీద పడటం తో ఉన్మాదిలా మారాడు. ఆదివారం భార్య ప్రియను క్రికెట్ బ్యాట్ తో కొట్టి చంపాడు. ఆ తరవాత ఇద్దరు కుమారులను దిండు తో ఊపిరి ఆడకుండా చేసి హతమార్చాడు. అనంతరం అతడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన పై సమాచారం అందిన పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news