ప్రాణం తీసిన వివాహేత‌ర బంధం

-

ఖ‌మ్మం జిల్లాలో వివాహేత‌ర బంధం నిండు ప‌సి ప్రాణాన్ని బ‌లి తీసుకుంది.దీంతో ఈ ఘ‌ట‌న జిల్లావ్యాప్తంగా సంచ‌ల‌నం అయింది. ఖ‌మ్మం జిల్లా బోన‌క‌ల్లులో జ‌రిగిన ఈ ఘ‌ట‌న పై పోలీసులు విచార‌ణ చేప‌డుతున్నారు. సొంత మామ (భ‌ర్త తండ్రి)తో వివాహేత‌ర బంధం ఉన్న ఓ మ‌హిళ అత్యంత పైశాచిక రీతిలో ప్ర‌వ‌ర్తించి,త‌న గుట్టు బ‌య‌ట‌ప‌డిపోతుందేమోన‌ని భ‌య‌ప‌డి క‌డుపున బిడ్డ‌నే చంపేసింది.మామ‌తో స‌న్నిహితంగా ఉన్న సంద‌ర్భంలో ఆమె కూతురు చూసింది.

ఈ విష‌యం ఎక్క‌డ బ‌య‌ట‌కు పొక్కుతుందేమోన‌ని ఆమె త‌న బిడ్డ‌ను ఎవ్వ‌రికీ అనుమానం రాకుండా మామతో క‌లిసి చంపేసింది. బాలిక కాళ్లు క‌ట్టేసి అత్యంత కిరాత‌కంగా చంపి ఆ త‌రువాత పెద్ద డ్రామానే న‌డిపారు కానీ పోలీసుల ద‌ర్యాప్తులో అస‌లు విష‌యం తెలియ‌డంతో సంబంధిత అధికారులు సైతం విస్తుబోయారు.

Read more RELATED
Recommended to you

Latest news