లక్నో- అయోధ్య హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం… ఆరుగురి దుర్మరణం

-

దేశంలో ప్రతీరోజు ఎక్కడో ఓ చోట ఘోర రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. అతివేగం… అజాగ్రత్తం రోడ్డు ప్రమాదాలకు కారణం అవుతోంది. ప్రమాదాల్లో కుటుంబాలకు కుటుంబాలే దుర్మరణం పాలవుతున్నారు. అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా… రోడ్డు ప్రమాదాలకు అడ్డుకట్ట పడటం లేదు.

లక్నో- అయోధ్య హైవేపై ఈరోజు ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.  ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకి జిల్లా రామ్ సనేహి ఘాట్‌లో ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మరణించారు. మృతుల్లో దంపతులు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. గుజరాత్ లోని అహ్మదాబాద్ నుంచి అయోధ్యకు వెలుతున్న క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుందని ఏఎస్పీ పూర్ణేందు సింగ్ తెలిపారు. యూపీ నారాయణపూర్ సమీపంలోకి రాగానే పక్కనే ఉన్న కంటైనర్ ట్రక్కును కారు అతివేగంతో ఢీ కొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు మృతి చెందారు.

 

Read more RELATED
Recommended to you

Latest news