మేనకోడలిని గర్భవతిని చేసిన మేనమామ.. ఆ త‌ర్వాత ఏం జ‌రిగిందంటే..?

-

మేనకోడలిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన మేనమామ… ఆమె జీవితాన్ని చిదిమేశాడు. మైనర్ బాలిక అయిన మేనకోడలిపై మేనమామ అత్యాచారం చేశాడు. దీంతో ఆమె గర్భం దాల్చింది. దీంతో 12 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ ముంబై ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. వివ‌రాలు చూస్తే.. ముంబై నగరానికి చెందిన పదమూడేళ్ల మైనర్ బాలికపై స్వయానా మేనమామ అయిన 27 ఏళ్ల యువకుడు పలుసార్లు అత్యాచారం చేసి గర్భవతిని చేశాడు.

దీనికి సంబంధించి పోలీసులకు బాలిక తల్లి ఫిర్యాదు చేసింది. అయితే, ఆ తర్వాత ఫిర్యాదు ఆమె వెనక్కి తీసుకుంది. కానీ, వైద్యులు, పోలీసులు అందించిన సాక్ష్యధారాలను పరిశీలించిన ముంబై ప్రత్యేక కోర్టు నిందితుడికి 12 ఏళ్ల కఠిన కారాగారశిక్షను విధించింది. బాధితురాలి కుటుంబంతో నిందితుడు రెండున్నర నెలలు గడిపాడని… ఆ సమయంలో ఆమెను పలుమార్లు అత్యాచారం చేశాడని పోలీసుల దర్యాప్తులో తేలింది.

Read more RELATED
Recommended to you

Latest news