కామారెడ్డి లో దారుణం.. పట్టపగలే హత్యకు గురైన యువకుడు

-

పట్టపగలే ఓ యువకుడు దారుణ హత్యకు గురైన ఘటన కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం ఆరేపల్లి గ్రామ శివారులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన బోయ నవీన్ (25) అనే యువకుడు ఆటో డ్రైవర్ జీవనం సాగిస్తున్నాడు. అయితే ఇవాళ ఉదయం తన తల్లిదండ్రులను పొలం వద్ద వదిలి ఆటోపై ఇంటికి వెళ్తున్నారు. ఈ క్రమంలోనే హెల్మెట్ ధరించిన ఇద్దరు ఆగంతకులు బైక్ పై వచ్చి నవీన్ పై విచక్షణా రహితంగా కత్తులతో దాడి చేసి హతమార్చారు.

రోడ్డుపై వెళ్తున్న వారు, ఆ ప్రాంతంలో పొలం పనులు చేస్తున్న వారు హత్య జరుగుతుండగా చూసినట్లుగా తెలుస్తోంది. స్థానికుల సమాచారం మేరకు.. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు హత్యకు గల కారణాల గురించి ఆరా తీస్తున్నారు. ఘటన స్థలంలో ఆధారాలు సేకరించి, కేసు నమోదు చేసుకుని హంతకుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఈ హత్యకు అక్రమ సంబంధమే కారణం అనే అనుమానాలు వ్యక్తం మవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news