రైస్ పుల్లింగ్ కీలక సూత్రధారి రాజును అరెస్టు చేసిన బెంగళూర్ పోలీసులు

-

రైస్ పుల్లింగ్ కీలక సూత్రధారి రాజు ను అరెస్ట్ చేసారు బెంగళూరు పోలీసులు. బెంగళూరులో పలువురు వ్యాపారవేత్తలను మోసం చేసాడు నిందితుడు రాజు. బెంగళూరులో నమోదైన 15 కేసులకు సంబంధించి మోస్ట్ వాంటెడ్ గా ఉన్నాడు రాజు. రాజుని పట్టుకొని బెంగళూరు తీసుకొని వెళ్లారు పోలీసులు. కిడ్నాప్, దోపిడీలకు పాల్పడుతున్న సూడో పోలీస్ ముఠా సూత్రదారి, హైదరాబాద్ కు చెందిన సత్యనారాయణ రాజు అరెస్ట్ చేసారు బెంగళూరు పోలీసులు.

గొలుసు దొంగలు-పోలీసుల దాడి
గొలుసు దొంగలు-పోలీసులదాడి

జూబ్లీ హిల్స్ నుంచి పారిపోతున్న నిందితున్ని వెంటాడి, వేటాడి పట్టుకున్నారు బెంగుళూర్ పోలీసులు. తెలంగాణ ఇంటలిజెన్స్ అధికారులుగా ఫేక్ ఐడి లతో చలామణి అవుతూ.. సంపన్నులు, వారి పిల్లలు టార్గెట్ గా కిడ్నాప్ లు చేసేవాడు రాజు. బెంగళూరు శివార్లలో డెన్ ఏర్పాటు చేసుకున్నారు ఈ గ్యాంగ్. న్యూడ్ వీడియోస్ చిత్రీకరించి సోషల్ మీడియాలో పెడతామని బెదిరించి భారీగా వసూళ్లు చేసేవారు.

ఒక ఎమ్మెల్యే అభ్యర్ధిని సైతం కిడ్నాప్ చేసింది ఈ ముఠా. మొత్తం 15కేసులు నమోదు చేశారు.ఈ ముఠా కోట్లల్లో వసూళ్లు చేసినట్టు గుర్తించారు. హైదరాబాద్ కు చెందిన ప్రసాద్, మహారాష్ట్ర కు చెందిన సిద్ధార్థ, నాగురావు, కిరణ్, బానుదాస్ లతో ముఠా ఏర్పాటు చేసినట్టు గుర్తించారు.

Read more RELATED
Recommended to you

Latest news