కంటైనర్ లారీ ఢీ.. 10మంది మృతి..17మందికి గాయాలు..!

-

అహ్మదాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 10 మంది ప్రాణాలు కోల్పోగా.. 17 మందికి తీవ్రగాయాలయ్యాయి. తెల్లవారుజామున ఓ కంటైనయిర్, లారీ ఒకదానికొకటి బలంగా ఢీకొట్టుకోవటంతో ఈ ప్రమాదం జరగింది. ఈ ఘటనకు సంబంధించిన స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తెల్లవారు జామున వడోదర దగ్గర్లో పొగ మంచు వాతావరణం ఉంది. అలాంటి చోట.. ఓ లారీ.. సూరత్‌ నుంచి పావగఢ్‌కు వెళ్తూ.. వడోదర శివారులోని వాగోడియా క్రాస్‌ రోడ్డు దగ్గర్లో ఉన్న వంతెనపై కంటైనర్‌ను బలంగా ఢీకొంది. పెద్ద శబ్దం వచ్చింది. ఆ తర్వాత ఆర్తనాదాలు.. అంతా అయోమయం. రోడ్డుపై ట్రాఫిక్‌ భారీగా స్తంభించిందని తెలిపారు.

చుట్టుపక్కల వారు అక్కడకు వెళ్లి.. గాయపడిన వారిని బయటకు తీస్తూ… మరోవైపు పోలీసులకూ సమాచారం అందించారు. వెంటనే అక్కడకు వెళ్లిన పోలీసులు… సహాయ చర్యలు ప్రారంభించారు. క్షతగాత్రులను త్వరితగతిన ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.ప్రమదానికి సంబంధించి వివరాలను రిపోర్ట్ ఇవ్వాలని పోలీసులను ఆదేశించారు.

ఈ ప్రమాదంలో రెండు కారణాలు ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఒకటి వాతావరణంలో పొగ మంచు లాంటిది ఉండటం వల్ల రోడ్డు సరిగా కనిపించలేదు. అందువల్ల ప్రమాదం జరిగి ఉండవచ్చు.. మరొకటి డ్రైవర్ అతివేగం నిద్రమత్తు.. ఒకవేళ లారీ నెమ్మదిగా వచ్చి ఉంటే ఈ ఘోరప్రమాదం జరిగి ఉండేది కాదని స్థానికులు అంటున్నారు.. ఏదిఏమైన 10 మంది చనిపోవటం తీవ్ర ఆ కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.. కొందరు నిద్రలోనే అనంతలోకాలకు వెళ్లిపోయారు. మరికొందరు తీవ్రగాయాలతో ఆర్థనాథాలు చుట్టుపక్కలవారిని భయాందోళనకు గురిచేశాయి..మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.. ఆ లారీ కంటైనయిర్ ఎక్కడ నుంచి వస్తున్నాయి.. వారి స్వస్థలాలు , మృతులు పేర్లు మొదలైన నివేదిక ఇవ్వాలని సీఎం ఇప్పటికే ఆదేశాలు జారీచేశారు.

Read more RELATED
Recommended to you

Latest news