దారుణం..కూతుర్ని చంపిన తండ్రి..సోషల్ మీడియా లో సెల్ఫీ వీడియో పోస్ట్

-

విశాఖ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. కన్న కూతురి పరువు హత్య కలకలం రేపుతోంది. కూతురిని హతమార్చిన కన్న తండ్రి….ఆ తర్వాత హత్య చేసినట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇప్పుడు ఆ వీడియో వైరల్ గా మారింది. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే.. 13 ఏళ్ల క్రితం వడ్డాది వరప్రసాద్ (42)ను వదిలేసి వెళ్ళిపోయింది భార్య హేమలత.

దీంతో 13 ఏళ్ల నుంచి ఇద్దరు ఆడపిల్లల్ని పెంచాడు తండ్రి వరప్రసాద్. పెద్ద కూతురు ప్రేమ పెళ్లి చేసుకొని వేరే వ్యక్తితో వెళ్లిపోగా..రెండు రోజులు క్రితం చిన్న కూతురు లిఖిత శ్రీ కూడా అరవింద్ అనే యువకుడితో వెళ్లిపోయిందని వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.

కట్టుకున్న భార్య, కన్న కూతుళ్లు వదిలేసి వెళ్లిపోయారని మనస్థాపానికి గురయ్యాడు తండ్రి వరప్రసాద్. దీంతో చిన్న కూతురు లిఖిత శ్రీ ను చంపి సెల్ఫీ వీడియో చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు తండ్రి. దీంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్ కు తరలించారు పోలీసులు. అటు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు విశాఖ వన్ టౌన్ పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news