అల్వాల్ లో డీసీఎం బీభత్సం.. బాలుడు మృతి

-

సికింద్రాబాద్ అల్వాల్ లో గురువారం డీసీఎం వ్యాన్ బీభత్సమే సృష్టించింది. అల్వాల్ లోని ఓ సూపర్ మార్కెట్ కి సరుకులతో వచ్చిన డీసీఎం ఒక్కసారిగా పాదచారుల పైకి దూసుకొచ్చింది. అదే సమయంలో తల్లితో పాటు నడుచుకుంటూ వెళ్తొన్న తిరుపాల్ (9), ను ఢీ కొట్టింది. తీవ్రంగా గాయపడిన బాలుడిని ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. 

డీసీఎం వ్యాన్ డ్రైవర్ నిర్లక్స్యమే ప్రమాదానికి కారణం అని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ అక్కడి నుంచి పరార్ అయ్యాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ బాలుడు మరణించడంతో కుటుంబ సభ్యులు రోదనలు చూసి స్థానికులు సైతం కంట తడి పెట్టారు. కొద్ది సేపు అక్కడ స్థానికులు ధర్నా చేశారు.  డ్రైవర్ పై తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news