దుర్గమ్మ నిమజ్జనంలో అపశ్రుతి.. నదిలో కొట్టుకుపోయి 8 మంది దుర్మరణం

-

దేశవ్యాప్తంగా దుర్గా నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. భక్తులంతా ఈ తొమ్మిది రోజులు భక్తిశ్రద్ధలతో అమ్మవారిని కొలిచారు. విజయదశమిని పురస్కరించుకుని నవరాత్రి ఆఖరి రోజున దేశవ్యాప్తంగా దుర్గమ్మను గంగమ్మ ఒడికి చేర్చారు. ఈ క్రమంలో పశ్చిమబెంగాల్‌లోని జల్పాయ్‌గురిలోని దుర్గమ్మ నిమజ్జన వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది.

పశ్చిమబెంగాల్‌లోని జల్పాయ్‌గురిలో దసరా రోజున తీవ్ర విషాదం చోటుచేసుకుంది. స్థానిక మాల్‌ నదిలో అమ్మవారి విగ్రహాన్ని నిమజ్జనం చేస్తుండగా ఒక్కసారిగా నదీ ప్రవాహం పెరగడంలో ఈ ప్రమాదం సంభవించింది. నదీప్రవాహం ఉద్ధృతంగా ఉండటంతో ప్రవాహం ధాటికి కొట్టుకుపోయి 8 మంది దుర్మరణం పాలయ్యారని పోలీసులు వెల్లడించారు. వ

రదలో పలువురు కొట్టుకుపోయారని పోలీసులు తెలిపారు. 50 మందిని రక్షించామని, గల్లంతైన వారికోసం ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలతో గాలింపు చర్యలు చేపట్టినట్టు పోలీసులు వివరించారు. ఎనిమిది మంది మరణంతో పండుగ పూట వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.

Read more RELATED
Recommended to you

Latest news