బ్రేకింగ్: తహసీల్దార్‌ చాంబర్‌లో ఒంటిపై పెట్రోల్‌ పోసుకున్న రైతు.. ఏం జ‌రిగిందంటే..?

-

ఇటీవ‌ల అబ్దుల్లాపూర్‌మెట్‌లో తహసీల్దార్ విజయారెడ్డి దారుణ హత్యకు గురైన విష‌యం తెలిసిందే. అయితే ఇది మ‌ర‌వ‌క ముందే కడప జిల్లాలో తహసీల్దార్‌ చాంబర్ లో ఓ వ్యక్తి తనపై పెట్రోల్‌ పోసుకున్న ఘటనకలకలం రేపింది. ఆ జిల్లాలోని కొండాపురం మండలంలోని బుక్కపట్నం గ్రామానికి చెందిన బి. ఆదినారాయణ (46) అనే రైతుకు బుక్కపట్నంలోని 122 సర్వేనంబర్‌లో 10.94 ఎకరాల డీకేటీ భూమి ఉండగా, దాంట్లో 3.50 ఎకరాల భూమికి గ్రామానికి చెందిన నరసింహ అనే వ్యక్తి ఓ ప్రాజెక్టు కింద ముంపు పరిహారం తీసుకున్నాడు.

ఆ భూమిలో 3.50 ఎకరాలు తన తండ్రి పేరుతో ఉందంటూ దాన్ని తన తల్లి పేరుమీద ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని కోరుతున్నారు. తహసీల్దార్‌ కార్యాలయానికి ఈ పని మీదే మూడేళ్లుగా వచ్చిపోతున్నాడు. దీంతో విసిగిపోయిన ఆయన నిన్న ఈ ఘటనకు పాల్పడ్డాడు. ఆయనపై నీళ్లు చల్లిన అక్కడి సిబ్బంది అనంతరం ఆయనను పోలీసులకు అప్పగించారు.

Read more RELATED
Recommended to you

Latest news