హైద‌రాబాద్ లో అగ్ని ప్ర‌మాదం

-

తెలంగాణ రాష్ట్రంలో ని హైద‌రాబాద్ న‌గ‌రంలో సోమ వారం రాత్రి అగ్ని ప్ర‌మాదం జ‌రిగింది. హైదరాబాద్ న‌గ‌రం లో ని సనత్ నగర్ ప్రాంతం లో ని స్వాతి ప్రమోటర్స్ కార్యాలయంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ అగ్ని ప్ర‌మాదం షార్ట్ సర్క్యూట్ కారణంగా నే జ‌రిగింద‌ని పోలీసులు తెలిపారు. అయితే అగ్ని ప్రమాదం జ‌రిగిన ప్రాంతం పక్కనే భారత్ పెట్రోల్ బంక్ ఉంది. దీంతో అక్క‌డ ఉన్న ప్ర‌జ‌లు పెట్రోల్ బంక్ తో ఎదైన జ‌రుగుతుందో అని భ‌యందోళ‌న‌ల కు గురి అయ్యారు.

అయితే స్థానికంగా ఉన్న ఫైర్ సిబ్బంది స‌కాలంలో రావ‌డం తో మంట‌లు అదుపు చేశారు. దీంతో మంట‌లు భార‌త్ పెట్రోల్ బంక్ వైపు రాలేదు. దీంతో భారీ ప్ర‌మాదం త‌ప్పింది. అయితే ఈ అగ్ని ప్ర‌మాదం లో ఎలాంటి ప్రాణ నష్టం జర‌గ‌క పోవ‌డం తో స్థానిక ప్ర‌జ‌లు ఊపిరి పీల్చుకున్నారు. అయితే స్వాతి ప్ర‌మోట‌ర్స్ కార్యాలయంలో ఉన్న ఫర్నిచర్ తో పాటు ఫైల్స్ పూర్తిగా ద‌గ్ధం అయ్యాయి. అయితే ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అలాగే అగ్ని ప్ర‌మాదం ఎలా జ‌రిగింద‌ని దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news