వంతెనపై ప్రమాదం.. సాయం చేసేందుకు ఆగిన ఐదుగురు దుర్మరణం

-

ముంబయిలో పండుగ పూట విషాదం చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదం జరిగిందని గమనించి గాయపడిన వారికి సాయం చేయడానికి ఆగిన వారిపై కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో సాయం చేసేందుకు ఆగిన ఐదుగురు దుర్మరణం చెందారు. ఈ విషాద ఘటన ముంబయిలోని బాంద్రా- ఓర్లి వంతెనపై జరిగింది. ఈ ప్రమాదంలో మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. అసలేం జరిగిందంటే..?

ముంబయిలోని బాంద్రా- ఓర్లి వంతెనపై బుధవారం వేకువజామున మూడు గంటల సమయంలో ఓ కారు వంతనెపై ఉన్న డివైడర్​ను ఢీ కొట్టింది. సమాచారం అందుకున్న వెంటనే క్షతగాత్రుల కోసం అంబులెన్స్ వచ్చింది. అదే మార్గంలో వెళ్తున్న రెండు కార్లలోని వారు.. అక్కడే ఆగి వారికి సాయం అందించారు. ఇంతలో అదే దారిలో అతి వేగంగా ఓ కారు దూసుకొచ్చింది. పక్కనే పార్క్ చేసిన​ అంబులెన్స్​ను, ఇతర వాహనాలను ఢీకొట్టింది.

ఈ ఘటనలో ఐదుగురు దుర్మరణం చెందారు. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం గాయపడ్డ వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ప్రమాదంతో బాంద్రా – ఓర్లీ రోడ్డును తాత్కాలికంగా మూసివేశారు.

Read more RELATED
Recommended to you

Latest news