వాళ్ళ ప్రేమ కోసం, స్నేహితురాలని వాడుకుని చంపేశారు…!

-

స్నేహం అనేది చాలా విలువైనది. ఈ విషయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రపంచంలో స్నేహం అనేది ఎంత ఖర్చు పెట్టినా సరే దొరికే అవకాశం లేదు. అలాంటి స్నేహాన్ని నమ్మించి చంపేశారు ఒక ప్రేమ జంట. వివరాల్లోకి వెళితే ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌హెహర్‌లో రూబీ, కపిల్ అనే అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నారు. అయితే వాళ్ళ పెళ్ళికి పెద్దలు అంగీకరించలేదు.

ఒప్పించడానికి చాలా కష్టపడ్డారు. అయినా సరే అంగీకరించలేదు తల్లి తండ్రులు. దీనితో వాళ్ళు వేసిన ఒక పథకం ప్రపంచాన్ని భయపెడుతుంది. ఈ నేపధ్యంలోనే పూనం అనే మరో యువతితో కపిల్ స్నేహం చేసాడు. జనవరి 26 సందర్భంగా షాపింగ్ కి వెళ్దామని పూనం కి ఫోన్ చేసాడు కపిల్. అతని మాటలను పూనం నమ్మి షాపింగ్ కోసం బయటకు వచ్చింది. రూబి కపిల్ ఇద్దరు కూడా ఒక ప్లాన్ చేసారు.

ఆమెను చంపాలని నిర్ణయం తీసుకున్నారు. కారు సీటు బెల్టుతో పూనం గొంతు పిసికి చంపేసి తర్వాత ఆమెకు రూబి దుస్తులు వేసి ఇంటి వద్ద ఉన్న ఒక షెడ్డులో ఆమెను పడేసాడు అతను. దీనితో చనిపోయింది రూబి అని నమ్మించే ప్రయత్నం చేసారు. కాని వాళ్ళ పథకం మధ్యలోనే ఆగిపోయింది. పోలీసులు ఇద్దరినీ అదుపులోకి తీసుకుని విచారణ చేయగా అసలు విషయం వెలుగులోకి రావడంతో వారిపై కేసు నమోదు చేసి జైలుకి తరలించారు.

Read more RELATED
Recommended to you

Latest news