ఆ దేశాల్లో ఐటీ ఉద్యోగాల పేరిట మోసం.. స్పష్టం చేసిన కేంద్రం..

-

ఉద్యోగాల పేరిట ఈరోజుల్లో ఎక్కువగా మోసాలు జరుగుతున్నాయి. విదేశాల నుంచి ఐటీ కంపెనీలో జాబ్‌ ఆఫర్లు వస్తున్నాయని అవి ఫేక్‌ అని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మోసాల్లో ఇండియన్స్‌ చిక్కుకుని మోసపోవద్దని సూచించింది. ఫేక్​ ఐటీ జాబ్​ ఆఫర్లతో జాగ్రత్తగా ఉండాలని భారతీయులకు కేంద్ర ప్రభుత్వం సూచనలు జారీ చేసింది. తప్పుడు సంస్థల పేరుతో థాయ్​లాండ్​, మయన్మార్​లలో ఐటీ ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి కొందరు భారీగా మోసం చేస్తున్నారని హెచ్చరించింది.

విదేశాల్లో ఫేక్​ ఐటీ జాబ్​ ఆఫర్స్​ వ్యవహారం గత కొంతకాలంగా ఇండియాలో గుట్టుగా సాగుతంది. ఉద్యోగానికి ఆశ పడి చాలా మంది ముందు వెనక చూసుకోకుండా.. లక్షల కొద్ది డబ్బులు ముట్టజెప్తున్నారు. అలా డబ్బులు కట్టిన వారిని మయన్మార్​కు తీసుకెళ్లి కూలీల కింద వాడుకుంటున్న ఉదంతాలు ఒక్కొక్కటిగా బయటకొచ్చాయి. ఈ విధంగా మోసపోతున్నారు.

ఈ విషయంపై విదేశాంగశాఖ ప్రతినిధి ఆరిందమ్​ బగ్చి సైతం స్పందించారు. థాయ్​లాండ్, మయన్మార్​​లో ఉద్యోగాల విషయంలో జ్రాగత్తగా ఉండాలని భారత యువతకు సూచించారు.​ చాలా మంది థాయ్​లాండ్​, మయన్మార్​కు వెళుతున్నారు. మయన్మార్​లో ఇది చాలా ఎక్కువగా ఉంది. కూలీలుగా ఉన్న 30మందిని రక్షించినట్లు విదేశాంగ ప్రతినిధి పేర్కొన్నారు.

ఇంకో 80-90మంది అక్కడే ఉండొచ్చని అంచనా.. ఇక తాజాగా శనివారం కేంద్రం విడుదల చేసిన అడ్వైజరీ సైతం.. ఆయా జాబ్​ రాకెట్లతో జాగ్రత్తగా ఉండాలని స్పష్టం చేసింది. ముఖ్యంగా ఐటీ రంగంలో నైపుణ్యం ఉన్న యువతను ఆకర్షించి, మోసం చేస్తున్నారట. సోషల్​ మీడియాలో వస్తున్న పోస్టులను చూసి మోసపోకూడదని, వాటిని నమ్మవద్దని స్పష్టంగా కేంద్రం చెప్తుంది.

ఉద్యోగాల కోసం టూరిస్ట్​ వీసాల మీద వెళ్లాలని అనుకుంటున్న భారతీయులు ఆ విదేశీ యాజమాన్యంపై పక్కా సమాచారం తీసుకోవాలి. ఏజెంట్లకు సంబంధించిన పూర్తి వివరాలను కూడా సేకరించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. మయన్మార్​లోని భారత రాయబార కార్యాలయం కూడా ఈ విషయంపై అడ్వైజరీని జారీ చేసింది. మయన్మార్​లోని తూర్పు సరిహద్దు కేంద్రంగా డిజిటల్​ స్కామింగ్​కు పాల్పడుతున్నట్లు తెలిపింది. కాబట్టి..ఉద్యోగాల మోజులో పడి మోసం పోవద్దు..తెలియని పని చేసేప్పుడు ఒకటికి పది సార్లు ఆలోచించండి.
Attachments area

Read more RELATED
Recommended to you

Latest news