దారుణం…గోవా వెళ్తే అవయవాలు మాయం చేశారు!

-

హైదరాబాద్‌ లో డ్రైవర్‌ గా పని చేసే.. శ్రీనివాస్‌ అనే వ్యక్తిని గోవాలో కిడ్నాప్‌ చేసి.. అవయవాలు కాజేశారు కొందరు కేటుగాళ్లు. ఈ సంఘటన ఇటీవల జరుగగా.. తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. డ్రైవర్‌ శ్రీనివాస్ గత నెల మార్చి 19న చౌటుప్పల్ దగ్గరి కొత్తగూడెం నుంచి గోవాకి వెళ్ళగా.. 20 న సాయంత్రం 9 గంటల నుండి ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యింది.

దీంతో 21న సాయంత్రం గోవా పోలీస్ స్టేషన్ లో అతని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. తర్వాత గోవాకి వెళ్లి ఎంక్వైరీ చేశారు…కానీ మాకు ఎలాంటి ఫలితం లేదు…. గోవా పోలీసులు నుంచి స్పందన రాలేదు. ఇక్కడి పోలీసులకు కంప్లైంట్ ఇస్తే గోవాకి వెళ్లి ఫిర్యాదు చేయమన్నారని.. ఎస్సార్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకో లేదని బాధితుడు శ్రీనివాస్ తమ్ముడు రజినీ కాంత్ పేర్కొన్నారు. అక్కడ ఫిర్యాదు చేస్తే ఇక్కడ చేయండి అన్నారని.. మాలాంటి కిడ్నాప్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారని చెప్పారు.

గోవా నుంచి ఎలా వచ్చాడో ఏమో తెలీదు… సోమవారం 4 గంటలకు ఆయనే స్వయంగా ఇంటికి వచ్చాడనొ.. మొత్తం బాడీ మొత్తం ఆప్రరేషన్ చేసినట్లు కుట్లు ఉన్నాయని వివరించారు బాధితుడు శ్రీనివాస్ తమ్ముడు రజినీ కాంత్. తల, నడుము భాగంలో, కాలేయం భాగంలో ఆపరేషన్ చేసినట్లు కుట్లు ఉన్నాయని.. ఆయనకు మతిస్తిమతం లేదన్నారు. ఆయన ఏం చెప్పలేక పోతున్నాడు… మాకు న్యాయం జరగాలని.. అక్కడ ఏం జరిగిందో ఏమో మాకు తెలియాలి… పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు జరగాలని డిమాండ్‌ చేస్తున్నారు. మాలాంటి వాళ్ళు అక్కడ చాలా మంది ఉన్నారని.. బాధితునకి బార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు… ఆయన్ని ప్రభుత్వం ఆదుకోవాలన్నారు బాధితుడు శ్రీనివాస్ తమ్ముడు రజినీ కాంత్. ఇక దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తారో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news