తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటన ఖరారు..2 రోజుల పాటు టూర్

-

తెలంగాణ రాష్ట్రంలో.. కాంగ్రెస్‌ పార్టీ కీలక నేత రాహుల్‌ గాంధీ పర్యటించనున్నారు. తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీని గాడిలో పెట్టేందుకు ప్రత్యేక సమావేశం నిర్వహించిన ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ రెండు రోజుల పాటు క్షేత్ర స్థాయిలో పర్యటించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 28 వ తేదీన వరంగల్‌ లో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు రాహుల్‌ గాంధీ హాజరు కానున్నారు.

తర్వాతి రోజు ముఖ్య నేతలతో.. రాహుల్‌ గాంధీ పర్యటించక చాలా కాలం అవుతోంది. తెలంగాణ పీసీసీ చీఫ్‌ గా రేవంత్‌ రెడ్డి.. నియామకం అయ్యాక.. పలుమార్లు రాహుల్‌ గాంధీతో సభ నిర్వహించాలని అనుకున్నారు. కానీ పరిస్థితులు అనుకూలించలేదు.

కానీ ఈ సారి మాత్రం అగ్రనేత రాహుల్‌ గాంధీ పర్యటన ఖరారు అయినట్లే సమాచారం అందుతోంది. ఇక తన పర్యటనలోపే.. కాంగ్రెస్‌ పార్టీ ని తెలంగాణలో బలోపేతం చేయాలని రాహుల్‌ గాంధీ పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ పార్టీకి కార్యకర్తలు బలంగా ఉన్నారని.. వారిని కాపాడుకోవాలని దిశా నిర్దేశం చేశారు రాహుల్‌.

Read more RELATED
Recommended to you

Latest news