రేపు పల్నాడు జిల్లా నరసరావుపేటలో సీఎం జగన్‌ పర్యటన

-

రేపు పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పర్యటన ఉండనుంది. రేపు ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్న సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి… 10.35 గంటలకు నరసరావుపేట ఎస్‌ఎస్‌ఎన్‌ కాలేజ్‌ గ్రౌండ్స్‌కు చేరుకోనున్నారు. 10.50 గంటలకు పీఎన్‌సీ కాలేజీ వద్ద కాసు వెంగళరెడ్డి విగ్రహావిష్కరణ జరుగనుంది.

ఇక రేపు ఉదయం 11.00 గంటలకు బహిరంగ సభలో పాల్గొననున్నారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి. అనంతరం వాలంటీర్లకు సత్కారం కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం జగన్.. 12.35 గంటలకు నరసరావుపేట నుంచి బయలుదేరి తాడేపల్లి నివాసానికి చేరుకోనున్నారు.

కాగా.. ఇవాళ సాయంత్రం 6 గంటలకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో సీఎం జగన్ భేటీ అయ్యారు.. ఢిల్లీ పర్యటన ముగించుకుని వచ్చిన వెంటనే రాజ్‌భవన్‌కు వెళ్లనున్న జగన్.. కేబినెట్ మార్పులపై గవర్నర్‌కు వివరించే అవకాశం ఉంది. ఇక ఎల్లుండి చివరి కేబినెట్ సమావేశం కానుంది. ఈ కేబినేట్‌ సమావేశం అనంతరం.. కేబినేట్‌ విస్తారణ జరుగే ఛాన్స్‌ ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news