అమ్మాయి ఫొటో డీపీ పెట్టొద్దని చెప్పినందకు విద్యార్థి సూసైడ్

-

అమ్మాయి ఫొటో డీపీగా పెట్టొద్దని టీచర్ మందలించడంతో ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్​ పోచంపల్లి మండలంలో చోటుచేసుకుంది.

పెద్దగూడెంలో ఇంటర్ రెండవ సంవత్సరం చదువుతున్న ఆకాశ్‌రెడ్డి అనే విద్యార్థి తన తోటి విద్యార్థిని ఫొటోను తన వాట్సాప్​ డీపీగా పెట్టుకున్నాడు. ఇది చూసిన గణిత ఉపాధ్యాయురాలు పోలీసులకు చెబుతానని బెదిరించడంతో మనస్థాపం చెందిన విద్యార్థి సూసైడ్‌ నోట్‌ రాసి బావిలోదూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మృత దేహాన్ని తెల్లవారుజామున వెలికితీశారు. ఉపాధ్యాయురాలు హెచ్చరించడంతోనే ఆకాశ్‌ రెడ్డి ఆత్మహత్యకు చేసుకున్నాడని, అతని మృతికి కారణమైన గణిత టీచర్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని ఎస్​ఎఫ్​ఐ నాయకులు డిమాండ్ చేశారు

Read more RELATED
Recommended to you

Latest news