షాకింగ్ న్యూస్: రోడ్డు ప్రమాదంలో ‘ముత్యాల ముగ్గు’ సీరియల్ హీరోయిన్లు మృతి

-

ఈ యాక్సిడెంట్ లో అదే సీరియల్ లో నటిస్తున్న హీరోయిన్లు భార్గవి, అనూష రెడ్డి అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. వాళ్లను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

జీతెలుగులో వచ్చే ముత్యాల ముగ్గు సీరియల్ లో నటించే ఇద్దరు హీరోయిన్లు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ ఘటన చేవెళ్ల సమీపంలో చోటు చేసుకున్నది. ముత్యాల ముగ్గు సీరియల్ షూటింగ్ నిమిత్తం టీం మొత్తం వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి అడవుల్లోకి షూటింగ్ కోసం వెళ్లింది.

Mutyala muggu serial heroins died in road accident in chevella

అదే సీరియల్ లో నటిస్తున్న ఇద్దరు హీరోయిన్లు సపరేట్ గా కారులో షూటింగ్ కోసం వెళ్తున్నారు. వాళ్ల కారు చేవెళ్ల సమీపంలోకి వెళ్లగానే వీళ్ల కారు హఠాత్తుగా ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి చెట్టును ఢీకొట్టింది.ఈ యాక్సిడెంట్ లో అదే సీరియల్ లో నటిస్తున్న హీరోయిన్లు భార్గవి, అనూష రెడ్డి అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.



వాళ్లను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. భార్గవి నిర్మల్ కు చెందిన యువతి కాగా… అనూష వరంగల్ కు చెందిన యువతి. వీళ్లు ముత్యాల ముగ్గుతో పాటు పలు సీరియళ్లలో నటించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మిగితా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news