దేశంలో ఇప్పుడు ఈ దొంగతనాలు.. చాలా హాట్ గురూ… ?

-


దొంగతనాలు అన్నది చాలా కామన్.. 64 కళల్లో చోర కళ కూడా ఉందని కొందరు దొంగలు ఘనంగా చెప్పుకుంటారుఎంతమంది ఉన్నా.. ఎంత క్లిష్టమైన పరిస్థితుల్లోనైనా తమ హస్త లాఘవం చాటుకుంటూ ఉంటారుఇక దొంగల్లోనూ చాలా మంది విచిత్రైన దొంగలు ఉంటారువీరిలో కొందకు కేవలం కొన్ని వస్తువులనే దొంగిలిస్తారు.

ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే.. ఇప్పుడు దేశంలో కొత్త తరహా దొంగతనాలు జరుగుతున్నాయిదొంగల కన్ను ఇప్పుడు బంగారంవాహనాలుఇతర విలువైన వస్తువులపై కంటే.. ఓ వస్తువుపై బాగా పడిందిఅదేంటో తెలుసా.. ఉల్లిపాయలు.. అవును ఇప్పుడు దేశంలో ఉల్లిపాయల దొంగలు పెరిగారు.

ఉల్లిధరలు రోజురోజుకూ ఆకాశాన్ని అంటుతున్న సమయంలో ఇప్పుడు దేశంలో ఉల్లి దొంగలు పుట్టుకొస్తున్నారుఅసలే పంట తక్కువై డిమాండ్ పెరిగిన నేపథ్యంలో ఉల్లిపాయలకు డిమాండ్ అమాంతం పెరిగిందిఅందుకే దొంగలు కూడా ఇప్పుడు ఉల్లి నిల్వలపై కన్నేశారునమ్మడం లేదా.. అయితే కొన్ని ఉదాహరణలు కూడా చూపిస్తాం.. తాజాగా బీహార్ రాజధాని పాట్నాలో లక్షల రూపాయల విలువైన ఉల్లిగడ్డలను దొంగతనం చేశారు.

గోదాములో దాచిన సరుకు ఉన్నపళంగా మాయమైందని సదరు వ్యాపారి గగ్గోలు పెడుతున్నాడుపోలీసులకు కంప్లయింట్ చేశాడుమరో ఉదంతంలో మహారాష్ట్ర నాసిక్ లోని ఓ దుకాణంలో లక్ష రూపాయల విలువైన ఉల్లిగడ్డలు మాయం అయ్యాయిఇప్పుడు పోలీసులకు ఇలా ఉల్లి దొంగలు సవాల్ గా మారారుఉన్న దొంగతనాల కేసులకు తోడు ఇప్పుడీ ఉల్లి గోల ఏంట్రాబాబూ.. అని ఖాకీలు తలలు పట్టుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news